బాబు జగ్జీవన్ రామ్ కు ఘన నివాళి

కోటగిరి : మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద జిల్లా ఎమ్మార్పీఎస్ సహాయ కార్యదర్శి సోంపుర్ పోచిరాం ఆధ్వర్యంలో ఆదివారం భారత మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ వర్ధంతి నిర్వహించారు. జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జగ్జీవన్ రామ్ అమర్ హే అంటూ నినాదాలు చేశారు. పోచిరాం మాట్లాడుతూ ..జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలు మరువలేనివని అన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి అని పేర్కొన్నారు. అందరూ ఆయన అడుగుజాడలో నడుస్తూ ఆయన ఆశలు నెరవేర్చాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గాయక్వాడ్ హనుమంతు, మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్, ఎత్తోండ మాజీ సర్పంచ్ ఆనంద్, కోటగిరి ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు హాస్గుల్ శ్రీకాంత్, ఉపాధ్యక్షులు కన్నం శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ నాయకులు హాస్గుల్ రవి, నర్సింలు, ఉపాధ్యాయులు సాయిలు, తదితరులు పాల్గొన్నారు.