
రుద్రూర్ : ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు వల్ల మండల కేంద్రంలో నివాస గృహాలు నీట మునిగి 50 మంది నిరాశ్రయులయ్యారు. వీరిని సోమవారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, గ్రామ తాజా మాజీ సర్పంచ్ ఇందూరు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు పునరావాసం కేంద్రాలకు తరలించారు. వరద బాధితులకు ఉదయం, మధ్యాహ్నం , సాయంత్రం భోజన వసతి ఏర్పాటు చేసి ఆశ్రయం కల్పించారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరు చంద్రశేఖర్, ఇందూర్ కార్తీక్, షేక్ నిసార్, పార్వతి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
