ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశం

రుద్రూర్ : మండలంలోని రాణంపల్లి గ్రామంలో తెలుగడం లావణ్య- తెలుగడం అరుణ్ నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లును కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ షాదుల్, వార్డు మెంబర్లు రాజు, కొండల్వాడి రాజు, తోట నర్సింగ్ రావు, నీరడి శంకర్, తోట భాస్కర్, కరొళ్ల సత్యం, రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు తోట సంగయ్య, నెరుగంటి బాలరాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.