రుద్రూర్: రుద్రూర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తించి బదిలీపై వెళుతున్న కానిస్టేబుళ్లను మంగళవారం ఎస్సై సాయన్న ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ఘనంగా సన్మానించారు. బదిలీపై వెళుతున్న కానిస్టేబుళ్లు ప్రదీప్, గణపతి, రేఖ పటేల్ అంకిత భావంతో విధులు నిర్వర్తించారని అభినందించారు. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సాధారణమేనని ఎక్కడకు వెళ్లినా తమ పని తీరుబట్టి తగిన గుర్తింపు వస్తుందని అన్నారు. కార్యక్రమంలో ఏఎస్సై రాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
