రుద్రూర్: ఇంటర్ లో ప్రతిభ కనబరచిన విద్యార్థుల తల్లిదండ్రులను బుధవారం రాత్రి రైడ్స్ ఆధ్వర్యంలోఘనంగా సన్మానించారు. అంబం (ఆర్ ) కు చెందిన కొర్వ విజ్ఞశ్రీ 993, రుద్రూర్ కు చెందిన చిక్కెల పూజిత 993, సాత్విక్ గౌడ్ 992 మార్కులు సాధించారు. రైడ్స్ సభ్యులు విద్యార్థుల ఇంటికీ వెళ్ళి వారి తల్లిదండ్రుల ను సన్మానించారు. కార్యక్రమం లో రైడ్స్అధ్యక్షులు కర్రోళ్ల కృష్ణ ప్రసాద్, అసోసియేట్ అధ్యక్షులు నర్సిములు, ప్రధాన కార్యదర్శి పార్వతి శేఖర్, కోశాధికారి చిదుర మహిపాల్, గౌరవ సలహాదారులు పత్తి రాము, ఇందూర్ చంద్రశేఖర్, రామరాజు, కెవి మోహన్, ఉపాధ్యక్షులు నూత్ పల్లి బాలరాజు, ఈరాపురం సాయిలు, జాయింట్ సెక్రటరీ లు ఎం.లలెందర్, సుదర్శన్ గౌడ్, టి. శివకుమార్, సమాచార కార్యదర్శి కౌలాస్ గంగాధర్, డైరెక్టర్ లు శానం సాయిలు, ఇందూర్ కార్తీక్, ఎం.జయకృష్ణ పాల్గొన్నారు.


