వక్స్ సవరణ బిల్లు వెనక్కి తీసుకోవాలి

రుద్రూర్: ముస్లిం సమాజం మనోభావాల్ని దెబ్బతీసే వక్ప్ సవరణ బిల్లును  వెంటనే  వెనక్కి తీసుకోవాలని మజీద్ సదర్ మహమ్మద్ ఇమ్రాన్ ఖాద్రి అన్నారు. శుక్రవారం రుద్రూర్ మండల కేంద్రంలో నమాజ్ అనంతరం వక్ప్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలు ధరించి   నిరసన తెలిపారు. వక్స్ సవరణ బిల్లు వెనక్కి తీసుకునేంతవరకు మా పోరాటాలు ఆగవని, ఎన్ని అవాంతరాలు సృష్టించిన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, అవసరమైతే కుటుంబ సభ్యులతో సహా రోడ్లపైకి వచ్చి పోరాడుతామని అన్నారు. ముస్లిం సమాజం సంక్షేమమే కేంద్ర ప్రభుత్వం కోరితే విద్య,ఆరోగ్యం పై దృష్టి సారించి స్కూల్స్, ఆసుపత్రులు నిర్మించాలని హితవు పలికారు.  కార్యక్రమంలో వివిధ మసీద్ సదర్ లు, టీఎంహెచ్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు లాల్ మొహమ్మద్, జిల్లా అధ్యక్షులు సయ్యద్ ముల్తానీ, మండల అధ్యక్షులు ముజాహిద్, మాజీ ఎంపీటీసీ షేక్ గౌస్, విండో డైరెక్టర్ షేక్ సుభాని, షేక్ నిసార్, ఫ్రుఖాన్  తదితరులు పాల్గొన్నారు.