
వర్ని: నందమూరి బాలకృష్ణ కు కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డు ప్రకటించడం పట్ల టీడీపీ మాజీ రాష్ట్ర కార్యదర్శి బి విఠల్ హర్షం వ్యక్తం చేశారు. వర్ని మండలం శ్రీనగర్ గ్రామం లో గురువారం ఆయన మాట్లాడుతూ… బాలకృష్ణ సినీ రంగం లో రాణించడం తో పాటు రాజకీయాల్లో ప్రజలకు సేవ చేస్తున్నారని అన్నారు. హైదరాబాద్ లో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ స్థాపించి అవసరమైన చికిత్స చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్నందున కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డు ఇచ్చిందని, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపార