ఓపీఎస్ ను పునరుద్ధరించాలి

రుద్రూర్ /కోటగిరి/ పోతంగల్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యునైటెడ్ పెన్షన్ స్కీమ్ ను వ్యతిరేకిస్తూ సోమవారం పీఆర్ టీయూ ఆధ్వర్యంలో  రుద్రూర్ ,కోటగిరి,పోతంగల్ మండల కేంద్రాల్లోని తహసీల్ కార్యాలయాల్లో వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టో లో పెట్టిన విధంగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్  ఇవ్వాలని వారు కోరారు. కార్యక్రమాల్లో  పీఆర్ టీయూ మండల, జిల్లా, రాష్ట్ర బాధ్యులు పాల్గొన్నారు.